ప్రభుత్వం పేదలకు అందిస్తున్న నిత్యవసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయని పుల్లల చెరువు పట్టణ టిడిపి నాయకులు మేడికొండ వెంకటేశ్వర్లు అన్నారు. అయినా ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ప్రతి కార్డుదారునికి అందజేయాలని ఆయన అన్నారు. ఎండియు వాహనాల ద్వారా అందిస్తున్న సరకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఒక పత్రికలో రేషన్ సరకులు ఇవ్వడం లేదని వచ్చిన కధనాన్ని ఆయన ఖండించారు.