బస్సు నుంచి జారిపడి ఓ క్లీనర్ మరణించాడు. ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన భక్తులు దక్షిణ భారత పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన టూరిస్ట్ బస్సులో బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద డ్రైవర్ క్యాబిన్లో కూర్చొని ఉన్న క్లీనర్ త్రిలోచన్ ఠాకూర్ ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి రోడ్డు పై పడ్డాడు. డ్రైవర్ వెళ్లి పరిశీలించిగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.