ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో శనివారం ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి టిడిపి నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో మురళి నాయక్ వీరమరణం పొందాడని పలువురు నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలుపుతూ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.