రక్త పరీక్షలో డెంగ్యూ ఉందని తేలితే నిర్లక్ష్యం చేయవద్దు. రోగిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టి, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గకుండా బొప్పాయి ఆకుల రసాన్ని స్వల్పంగా తాగిస్తూ ఉండాలి. రోగ నిరోధక శక్తి కోసం ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ ఆహారాలు డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.