TG: దేశంలోని అన్ని రాష్ట్రాలలో కులగణన చేయాలనే డిమాండ్ రానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనకు అసెంబ్లీలో ఆమోదం ఇవ్వనున్న వేళ ఆయన మాట్లాడారు. 'ఈ రోజు దేశంలో నిలిచిపోతుంది. మా నిర్ణయంతో కులగణన విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతుంది. ఏ రాష్ట్రమైనా సరే భవిష్యత్లో కులగణన అంశంపై మా రిఫరెన్స్ తీసుకోవాలి' అని పేర్కొన్నారు.