ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కాసేపట్లో త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరించనున్నారు. దీంతో ప్రయాగ్రాజ్తో పాటు, కుంభమేళా పరిసరాల్లో యూపీ ప్రభుత్వం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే మహాకుంభమేళాలో కొన్ని కోట్ల మంది జనాభా పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26తో ఈ మహాకుంభమేళా ముగియనుంది.