యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో మహా కుంభమేళాను రేపు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. బుధవారం ప్రయాగరాజ్కు విచ్చేసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో యూపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.