AP: తిరుపతిలోని చిల్లకూరు మండలం బూధనం టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఒకదానికొకటి ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను గూడూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.