ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్(33) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటన చేశారు.