ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జీజీహెచ్లో మీరాబీ అనే గర్భిణీ ఇటీవల ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశివు పుట్టిన వెంటనే మృతిచెందింది. అప్పటినుంచి మీరాబీ మనోవేదన చూసిన ఆమె స్నేహితురాలు ప్రభావతి ఆమె ఆవేదనను తీర్చాలనుకుంది. ఈ క్రమంలోనే అనారోగ్యంతో చనిపోయిన ఓ బాలింత భర్తను సంప్రదించి రూ. 1.90 లక్షలకు వారి ఆడ శిశువును కొనుగోలు చేసి, బిడ్డను మీరాబీ ఒడికి చేర్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు చెప్పటం శిశువు విక్రయం గురించి తెలిసింది.