SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట

52చూసినవారు
SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట
ఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ SBI జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపివేస్తూ జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రిజర్వు బ్యాంకు, ఎస్‌బీఐలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్