మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతిలో జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఈ ఆంక్షలు తేవడంతో ఏం జరగుతుందనే ఉత్కంఠ నెలకొంది.