ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలోని MI తరఫున IPL మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన పేరుతో ఉండే స్టాండ్ను చూస్తే ఎంతో ప్రత్యేక అనుభూతి ఫీల్ అవుతానని రోహిత్ శర్మ పేర్కొన్నారు. "నేను రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇప్పటికీ ఇంకో ఫార్మాట్లో ఆడుతున్నాను. ఇక్కడికి మే 21న ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబయి తరఫున ఆడేందుకు వస్తున్నాను. అప్పుడు నాకు ప్రత్యేక అనుభూతి దక్కుతుంది" అంటూ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు.