AP: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న విద్యార్థుల డేటాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారంతో సరిపోలుస్తోంది. గతంలో సచివాలయాల ద్వారా నిర్వహించిన డేటా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక జరిగేది. రెండు రోజులుగా దీనిపై అధికారులు సమీక్షలు చేయగా, నేడో, రేపో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశముంది.