ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షలు మాయం

72చూసినవారు
ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షలు మాయం
TG: నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద బస్సులో రూ.23లక్షల నగదుతో ఉన్న బ్యాగ్‌ మాయమైంది. ఆదివారం ఉదయం విజయవాడ నుంచి HYD వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును టిఫిన్‌ చేసేందుకు నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆపారు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్‌ను బస్సులో ఉంచి టిఫిన్‌ చేసేందుకు దిగారు. తిరిగి వచ్చి చూసి నగదు మాయమైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్