తల్లికి వందనం కచ్చితంగా అమలు చేస్తాం: మంత్రి

85చూసినవారు
తల్లికి వందనం కచ్చితంగా అమలు చేస్తాం: మంత్రి
AP: ఇచ్చిన హామీ ప్రకారం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. '2019లో జగన్ అధికారంలోకి వచ్చిన 9 నెలలకు 'అమ్మ ఒడి' అమలు చేశారు. ఇప్పుడు 2, 3 నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రూ. 15వేలు అని చెప్పి తక్కువ డబ్బులిచ్చి మోసం చేశారు. ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్