‘తల్లికి వందనం’ పథకం నుంచి రూ.2వేల మినహాయింపుపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తన ఖాతాలోకి ఆ డబ్బులు వచ్చాయని వైసీపీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ 24 గంటల్లో ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. లేదంటే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు. దీనిపై స్పందించిన వైసీపీ టీడీపీకి కౌంటర్గా గతంలో అమ్మఒడి నుంచి జగన్ డబ్బులు లాగేస్తున్నారని చేసిన విమర్శల వీడియోలను విడుదల చేసింది.