స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నిర్మించిన చిత్రం శుభం. ఈ మూవీలో సమంత కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదల కాగా.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైత్రీ మూవీస్ డిస్ట్రీబ్యూటర్ శశి సమంతపై ప్రశంసలు కురిపించారు. సమంత ఈ మూవీలో గోల్డెన్ లెగ్ అంటూ వ్యాఖ్యానించారు.