భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో మహారాష్ట్రలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా చెంబూర్లోని మహుల్ గ్రామంలో వీరు నివాసం ఉంటున్నట్లు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.