వైఎస్ జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘‘వివేకా హంతకులతో జగన్ తిరుగుతున్నారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? వినుకొండ హత్య.. వ్యక్తిగతంగా జరిగింది. అది రాజకీయ హత్య కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకోవాలి. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’’ అని షర్మిల కోరారు.