వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడామని షర్మిల తెలిపారు. జగన్ వల్ల పడిన ఇబ్బందులను విజయసాయిరెడ్డి చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే తన పిల్లలకు సంబంధించిన విషయమే తాను చెబుతానని షర్మిల అన్నారు. షేర్లు తనకే చెందాలంటూ తనపై, తన తల్లిపై జగన్ కేసు వేశారని షర్మిల ఆరోపించారు.