భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఇటీవల జరిగిన ఐదో టీ20లో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా ఆటగాడు శివందూబే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అదేంటంటే.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్లను గెలిచిన జట్టులో భాగమైన తొలి ఆటగాడిగా శివం దూబే వరల్డ్ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో దూబే ఆడిన 30 మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది.