AP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పదవిపై బుధవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గింది. దీంతో వైసీపీ నేత బాలమురళీకృష్ణ చైర్మన్ పదవి కోల్పోయారు. ఇటీవల టీడీపీలో వైసీపీ మెజారిటీ కౌన్సిలర్లు చేరడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.