ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. 8 గంటలుగా కృష్ణమోహన్, ధనుంజయ్రెడ్డిలతో సిట్ అధికారులు విచారణ జరిపారు. కసిరెడ్డితో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. లిక్కర్ పాలసీలో మీ జోక్యం ఏంటని సిట్ అధికారులు అడగగా కృష్ణమోహన్, ధనుంజయ్ కేసుతో తమకు సంబంధం లేదన్నారు. కృష్ణమోహన్ కుమారుడి సంస్థల్లో పెట్టుబడులపై ఆరా తీశారు. తన కుమారుడి వ్యాపారంతో సంబంధం లేదని కృష్ణమోహన్ పేర్కొన్నారు.