AP: కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐదుగురు SIలు, సీఐకి ఛార్జ్ మెమో జారీ చేశారు. సీఐ భాస్కర్రెడ్డి, ఐదుగురు ఎస్సైలు రంగస్వామి, తిరుపాల్ నాయక్, మహమ్మద్ రఫీ, ఎర్రన్న, అలీఖాన్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పోలింగ్ రోజున కడపలోని గౌస్నగర్లో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.