AP: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 27న సెలవు లభించనుంది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఆ జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలు జారీ చేశారు.