AA, నిర్మాణ సంస్థ గురించి వివరాలు వెల్లడించేందుకు స్పోక్స్ పర్సన్ను నియమిస్తామని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. దీంతో టాలీవుడ్లో ఓ హీరో ఇలా స్పోక్స్ పర్సన్ను నియమించుకోవడం ఇదే తొలిసారి అని నెట్టింట చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ టైంలో తన ప్రసంగాల్లో పొరపాట్లు తలెత్తడంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై మార్చిలో అధికారిక ప్రకటన ఉంటుందన్నారు.