గొర్రెల మందలోకి వచ్చిన జింక

83చూసినవారు
ఓ జింక పొరపాటున గొర్రెల మందలోకి వచ్చిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు ఈ మేరకు శనివారం చెప్పారు. చేజర్ల మండలం నాగుల వెలుటూరుకు చెందిన ఒక వ్యక్తి తన గొర్రెలను అడవికి తీసుకొని వెళ్లి , మేత మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గొర్రెల మందలో జింక కలిసింది. ఇది గమనించిన ఆ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు జింకను స్వాధీనం చేసుకుని జింకల పార్కుకు తరలించారు.

సంబంధిత పోస్ట్