భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయులు మహేష్, వెంకటేశ్వర్లు, రమణ రాజు, మదీనా, కృష్ణారెడ్డి, సురేష్, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.