అనంతసాగరం మండలంలోని రేవూరు ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి-2 కాటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో పలు రికార్డులను రిజిస్టర్ లను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం పై ఆరా తీశారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.