అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు సోమశిలలోని పలు పాఠశాలలను బుధవారం ఎంఈఓ 2 ప్రభాకర్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. ఇటీవల నాడు నేడు పనుల్లో భాగంగా నిర్మించిన తరగతి గదులను, మరుగుదొడ్లను పరిశీలన చేశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.