కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని బస్సు రెడ్డి పాలెం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. లింగసముద్రం మండలం రాళ్లపాడు కు చెందిన చిన్నబాబు గుడ్లూరులో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి విఆర్ కోటలోని అత్తగారింటికి వెళ్తుండగా మార్గం మధ్యలో బసిరెడ్డిపాలెం- చెంచురెడ్డి పాలెం మధ్య బైక్ అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.