ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని, వ్యవసాయ కార్మిక సంఘం గుడ్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం నుండి పనులు ప్రారంభిస్తామని ఎంపీడీఓ అన్నారు.