కందుకూరు డిఎస్పి ఏ శ్రీనివాసులు దంపతులు స్థానిక పట్టణంలో ఉన్న వాసవి నగర్ వినాయకుని ఆలయంలో వినాయక స్వామికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి నగర్ కమిటీ, ఆర్య వైశ్యులు డీఎస్పీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి దంపతులను వాసవి నగర్ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.