కావలి పట్టణ బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మొగలపల్లి రాజా, కుదువ వ్యాపార సంఘం అధ్యక్షులుగా కోట రమేష్ ని ఆయా సంఘాల సభ్యులు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిశారు. నూతనంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు.