టీడీపీ అధికారంలోకి రావాలని గత 5 సంవత్సరాలుగా పాదరక్షలు లేకుండా తిరిగి, నేడు అధికారంలోకి రాగానే దీక్షను విరమించడానికి దగదర్తి మండల ఉపాధ్యక్షుడు తాళ్ళురి సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. దగదర్తి మండలం కాట్రాయపాడు నుండి సుధాకర్ నాయుడు, వారి అనుచరులు దాదాపుగా 40 మంది తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.