కావలి రెవిన్యూ డివిజనల్ అధికారి వి. కే. శీనా నాయక్ కి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో శీనా నాయక్ కి పుష్ప గుచ్చం అందజేసి, కేక్ కట్ చేసి తినిపించారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో ఆర్డీవో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.