కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అభిమానులు ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో మాలకొండ వరకు పాదయాత్ర చేపట్టారు. నిన్న మొదలుపెట్టిన ఈ పాదయాత్ర సాయంత్రానికి 10 కిలోమీటర్లు జరిగింది. శుక్రవారం ఉదయాన్నే టిడిపి నాయకులు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే ఆయిన సందర్భంగా మాలకొండకు నడిచి వెళ్లి మొక్కు తీర్చుకుంటామన్నారు.