ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యమవుతాయన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.