ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి విజయం సాధించిన నేపధ్యంలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధు నాయకత్వంలో చేపట్టిన గుంటూరు టూ తిరుమల కాలినడక యాత్ర నెల్లూరు చేరుకుంది. కనగాల మధు ఆధ్వర్యంలో పాదయాత్రలో పాల్గొన్న టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని విపిఆర్ నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. పాదయాత్ర చేపట్టిన టిడిపి నాయకులును ఎమ్మెల్యే అభినందించారు.