కొడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఆర్ హేమలత పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వారిని సహచర ఉపాధ్యాయులు శనివారం ఘనంగా శాలువాలతో సన్మానించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు వసంతకుమారి, అంకయ్య, సహచర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.