ఇందుకూరుపేట మండలం గ్రామ పరిసరాల్లో ఉన్న ఎడగారులో నాటిన వరి పొలాలను బుధవారం పలువురు అధికారులు సందర్శించారు. మండలంలో ఎడగారు వరి నాటిన రైతులకు వరి పైరులో వచ్చే తెగుళ్లు, పురుగులు ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయాలను రైతులకు వివరించారు. పైరు పెరగకుండా ఉంటే జింక్ లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. జింకు లోపం నివారణకు జింక్ సల్ఫేట్ ను నీటిలో పిచికారి చేసుకోవాలన్నారు.