నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు, 28వ డివిజన్ జడ్పీ కాలనీ, పోస్టల్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చైతన్యపురి కాలనీలో ఉండే రోడ్ల కు ప్యాచ్ వర్క్ పనులను బుధవారం స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.