ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసమని అక్రమ రవాణా దారుల కోసం కాదని టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సొంతింటి కల నెరవేరాలని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేశారన్నారు.