
పరువు హత్య.. కూతురిని కడతేర్చిన తండ్రి
కర్ణాటకలోని బీదర్ జిల్లా బరాగెన్ తండాలో జరిగిన పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో సొంత కుమార్తెను ఓ తండ్రి నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఇతర కులానికి చెందిన యువకుడిని మోనిక (18) ప్రేమించిందని ఆమె తండ్రి మోతీరామ్ జాదవ్ తెలుసుకున్నాడు. కోపంతో రగిలిపోయాడు. శుక్రవారం ఆమెను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. సంత్పురా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.