సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా గురువారం దేవాదాయ శాఖ గూడూరు ఇన్స్పెక్టర్ సి. హెచ్. శ్రీనివాస బాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన స్థానిక ఆలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.