ఉదయగిరి మండలం దుర్గం పల్లె సమీపంలో భారీ కొండచిలువ సంచారం మంగళవారం కలకలం రేపింది. కొండ చిలువ సంచరించడాన్ని యువకులు తమ కెమెరాల్లో బంధించారు. దట్టమైన ఉదయగిరి కొండ ఉండడంతో ఇలాంటి భారీ కొండ చిలువ దర్శనచ్చింది. నెలరోజుల క్రితం ఉదయగిరిలో పులి సంచరిస్తున్నట్లు భారీగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఒకవైపు పులి భయంతో మరోవైపు ఇలాంటి పెద్ద పెద్ద పాములు వల్ల ఉదయగిరి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.