పామూరు మండలం కంబాలదిన్నె గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదివారం పర్యటించారు. ఆ గ్రామంలో జరుగుతున్న సీతారామ ఉత్సవాలకు గ్రామ పరిధిలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పిలుపుమేరకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక టిడిపి నాయకులతో ఆత్మీయ సమావేశం అయ్యారు. వారితో కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా చర్చించారు.