రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

76చూసినవారు
రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ 1వ తేదీ సోమవారం 10 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో జరుగు "ఎన్టీఆర్ భరోసా" పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పై కార్యక్రమానికి టిడిపి, జనసేన, బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని వింజమూరు మండల టిడిపి కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్