బిజెపి అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామీ అన్నారు. ఈ సందర్భంగా శనివారం హిందూపురం పట్టణంలో ఆయన బిజెపి నాయకులతో కలిసి పర్యటించారు. హిందూపురం నియోజకవర్గంలోని బిజెపి నాయకులు నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని అదర్శిస్తే ఖచ్చితంగా పోటీ చేసి అందరినీ కలుపుకొని పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు.